ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా పాజిటివ్… నిన్న మంత్రుల పర్యటనలో పాల్గొన్న గండ్ర

-

తెలుగు రాష్ట్రాల్లో వరసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఇటు కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటర రమణారెడ్డి, ఆయన భార్య వరంగల్ రూరల్ జెడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతిలకు కరోనా సోకింది. జ్వరం రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా.. వీరిద్దరికి పాజిటివ్ గా తేలింది. అయితే నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల పర్యటనలో వీరిద్దరు పాల్గొన్నారు. నిన్న వరంగల్ రూరల్, భూపాలపల్లి జిల్లాల్లో ఇటీవల వర్షాల కారణంగా.. పంటలు దెబ్బతిన్నాయి. వీటిని పరిశీలించేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు పర్యటించారు. ఈ పర్యటనలో గండ్ర దంపతులు పాల్గొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డితో పాటే హెలికాప్టర్ లో గండ్ర హైదరాబాద్ కు వెళ్లారు.

ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లకు కూడా కరోనా సోకింది. అంతకుముందు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలకు కూడా కరోనా సోకింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news