కరోనా పంజా.. తెలంగాణలో రికార్డ్ బ్రేక్ కేసులు..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజాగా.. బుధవారం కొత్తగా 1,924 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 1,590 నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి వారిలో ఇవాళ 11 మంది మృతి చెందారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసులు సంఖ్య 29,536 చేరుకోగా, ప్రస్తుతం 11,933 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 17,279 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 324 మంది మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news