డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. యువతిపై అత్యాచారం

-

కామాంధులు రెచ్చిపోతున్నారు. చట్టాలపై భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. చిన్నాపెద్దా, వావీ వరసలు మరిచి బరితెగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియాలో ఎక్కడో చోట రోజూ అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మైనర్ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం రేపింది. 

ఇదిలా ఉంటే ఈ మధ్య డేటింగ్ యాప్ లు ఎక్కువ అయ్యాయి. దీంతో యువతీయువకులు డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నారు. తాజాగా డేటింగ్ యాప్ ఓ యువతిపై అత్యాచారానికి కారణం అయింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ నెల 3న ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మహిళను రేప్ చేశాడు హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి. నిందితుడు, బాధితురాలు ఇద్దరు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఢిల్లీ పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version