కెప్టెన్ ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. రిషభ్ పంత్ను కెప్టెన్గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి ఎక్స్(ట్విట్టర్) లో షేర్ చేసింది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న పంత్కు NCA క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ సీజన్లో పంత్ కీపింగ్ చేసే అవకాశాలు తక్కువేనని ఆ జట్టు వెల్లడించింది.

గత సీజన్లో వార్నర్ సారథ్యం వహించారు.గత సీజన్ లోయాక్సిడెంట్ కారణంగా పంత్ దూరమవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ఘోర ప్రదర్శన చేసింది. వార్నర్ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్ ల్లో కేవలం 5 మ్యాచ్ ల్లో నిలిచి 9 వ స్థానంలో నిలిచింది.ఇప్పటివరకూ పంత్ ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 2838 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే, అతని ఖాతాలో ఆరు రనౌట్లు, 18 స్టంపింగ్‌లు,64 క్యాచ్‌లు ఉన్నాయి. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.ఇక మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version