నా రాజీనామాతో మునుగోడులో అభివృద్ధి పనులు – రాజగోపాల్ రెడ్డి

-

తన రాజీనామా తో మునుగోడులో ఆగ మేఘాలపై అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న జరిగే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో రాష్ట్ర ప్రజల తలరాతలు ముడిపడి ఉన్నాయన్నారు. బిజెపికి అమ్ముడుపోయానని ఆరోపణలు చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

మంత్రి అవినీతిపై త్వరలో చట్టా విప్పుతానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దమ్ముంటే చర్చకు సిద్ధం కావాలంటూ సవాలు విసిరారు. తాను రాజీనామా చేయకముందే అసెంబ్లీలో గట్టుప్పల్ మండలం, చౌటుప్పల్ లో రోడ్లను బాగు చేయాలని అడిగానని.. రాజీనామా చేసిన 20 రోజుల్లోనే పనులు అవుతున్నాయన్నారు. మునుగోడు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version