తెలంగాణలో ఐనట్లే..ఏపీలోనూ TDP సర్వ నాశనమే – దివ్యవాణి

-

తెలంగాణలో ఐనట్లే..ఏపీలోనూ TDP సర్వ నాశనమే అవుతుందని దివ్య వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివ్వ వాణి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ పరిస్థితి వచ్చిందో ఏపీలో అదే పరిస్థితి వస్తుందని దివ్య వాణి జోష్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన నాకు అన్యాయం చేశారు.

టీడీపీ జనార్దన్ కోవర్టులతో తప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అహర్నిశలు పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు లేకనే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేశానని వెల్లడించారు.

టీడీపీ నుంచి బయటకొచ్చాక పనికిమాలిన చెత్త వెధవలు నాపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యవాణి. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు పక్కన ఉన్న నాయకులు వల్లనే.. తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఇటీవలే దివ్యవాణి టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news