టాలీవుడ్ హీరోయిన్ల విద్యార్హత ఏమిటో తెలుసా..?

-

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లుగా చలామణి అవుతున్న వారిలో కొంతమంది ఉన్నత చదువులు చదివిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎవరెవరు ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక వారి గురించి ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. సమంత:తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం అన్ని భాషలలో కూడా నటిస్తూ తానేంటో నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ విద్యార్హత బీకాం డిగ్రీ పూర్తి చేసింది.

2. సాయి పల్లవి:అద్భుతమైన డాన్స్ తో.. నటనా పర్ఫామెన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంబీబీఎస్ పూర్తి చేసింది.

3. రష్మిక మందన్న:నేషనల్ కృష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే జర్నలిజం మరియు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

4. శృతిహాసన్:కమలహాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో , అందచందాలతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె బీఎస్సీ సైకాలజీ పూర్తిచేసింది.

5. పూజా హెగ్డే:ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఎమ్ కాం పూర్తి చేసింది.

6. నయనతార:సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిఏ లిటరేచర్ పూర్తి చేసింది.

7.కాజల్ అగర్వాల్:అందం , నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇక తన విద్యాభ్యాసం విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా పూర్తి చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version