బుల్లితెర యాంకర్ పారితోషికం ఎంతో తెలుసా.. ఎవరికి ఎక్కువంటే..?

-

వెండితెరపై సినిమాలలో హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ అయితే ఉంటుందో బుల్లితెర పై పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే యాంకర్ లకి కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. అందుకే వారికి ఎంతో క్రేజ్ కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే హీరోలు , హీరోయిన్ల సినిమాలలో యాంకర్లు కూడా నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఈ మేల్ యాంకర్లు సినిమాలలో హీరో లుగా , ఫిమేల్ యాంకర్ లు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ తమ స్థాయికి తగ్గట్టుగా పారితోషకం కూడా అందుకుంటున్నారు.

బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతున్న వారు ఎవరు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. సుమకనకాల : తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణి లా దూసుకుపోతున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె ఎన్నో షోలను విజయవంతంగా హోస్ట్ గా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా పలు సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈమె ఒక్కో ఫంక్షన్ కి రూ.2.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు.

2. మంజూష:ఇంటర్వ్యూలలో అధికంగా కనిపించే మంజూష ఒక్కొక్క ఎపిసోడ్ కి 30 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటోంది.

3. రవి:యాంకర్ రవి ప్రస్తుతం లక్ష రూపాయల వరకు పారితోషికం తీసుకుంటూ ఉండగా మరోవైపు పలు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు.

4. వర్షిని:యాంకర్ వర్షిని ప్రస్తుతం 30 వేల రూపాయలను పారితోషికంగా తీసుకుంటోంది . అయితే పలు సినిమాలతో పాటు జబర్దస్త్ ద్వారా కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

5.శ్యామల :శ్యామల యాంకర్ గా 50 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటోంది. అంతేకాదు మరొకవైపు సినిమాలో కూడా నటిస్తోంది ఈ అందాల తార.

6. ప్రదీప్:మేల్ యాంకర్ లో ప్రథమ స్థానంలో ఉన్న ప్రదీప్ ప్రస్తుతం లక్ష రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు. అంతేకాదు మరో వైపు సినిమాలలో హీరోగా కూడా నటిస్తున్నాడు.

7. రష్మి:అడపాదడపా సినిమాలు చేస్తున్నా ఈమె జబర్దస్త్ షో ద్వారా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ఇక ఈమె లక్ష రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

8. అనసూయ:అనసూయ సినిమా లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై కూడా ఒక్కో షో కి ఏకంగా 2 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version