ఆర్టీసీ చార్జీలు పెంచితే ప్రశ్నించకూడదా?: బండి సంజయ్

-

శుక్రవారం ఉదయం ఆర్టీసీ ఛార్జీల పెంపు పై జేబీఎస్ లో ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించేందుకు బంజారాహిల్స్ నుంచి జేబీఎస్ కు బయలుదేరారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారో అర్థం కాలేదు అన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. అరెస్టులు, జైల్లకు భయపడనని స్పష్టం చేశారు. ఆర్టీసీ చార్జీలు పెంచితే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

అర్ధరాత్రి జిట్టా బాలకృష్ణా రెడ్డి ని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను అని అన్నారు. ఉద్యమకారులను అరిగోస పెడుతున్నారని, ద్రోహులను సంకన వేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఆర్టీసీ ప్రయాణికులతో మాట్లాడేందుకే జేబీఎస్ బస్టాండ్ కి వెళుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. అంతకుముందు జేబీఎస్ పేరుతో డిజిపి కార్యాలయం ముట్టడికి వెళ్తారనే అనుమానంతో పోలీసులు బండి సంజయ్ ని హౌస్ అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version