రేవంత్ ఓ బ్లాక్ మెయిల్.. 4 పార్టీలు మారిండు – ఈటల కౌంటర్

-

హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2006 నుంచి రాజగోపాల్ రెడ్డి మంచి మిత్రుడని.. పోరాట స్పూర్తి ఉన్న మిత్రుడు రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు. రేవంత్ మాటలు సమాజం అసహ్యించుకునే విధంగా ఉన్నాయని అగ్రహించారు. రేవంత్ గత బ్లాక్ మెయిల్ ఇంకా మరిచినట్లు లేదని చురకలు అంటించారు.

రేవంత్ నాలుగు పార్టీలు మారిండని గుర్తు చేశారు. నిరాశ, నిస్పృహలో రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కనుమరుగు అవుతుంది.. ఎందుకు ప్రజాధారణ కోల్పోతుందనే దానిపై శోధించకుండా ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. దేశంలో ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్ అని విమర్శలు చేశారు. మునుగోడు లో బిజేపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.

 

Read more RELATED
Recommended to you

Latest news