చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్

-

ఏపీలో మాజీ సీఎం జగన్, వైఎస్ షర్మిల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరి మధ్య నెలకొన్న ఆస్తుల వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ..షర్మిలను జగన్ మోసం చేశారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ కూటమి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుందని ఆరోపించారు.

ఏపీలో వింత రాజకీయాలు నడుస్తున్నాయని ఫైర్ అయ్యారు. అదే విధంగా సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించిన టీడీపీ సభ్యత్వ నమోదుపై పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు.‘జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎంతగానో ఉపయోగించుకున్నారు. కానీ, ఆయనకు ఇప్పటికీ టీడీపీ సభ్యత్వం ఇవ్వలేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా అలాగే మోసం చేశారు.హెరిటేజ్‌లో ఆయన తోబుట్టువులకు ఏమైనా వాటాలు ఇచ్చారా? జగన్ ఇంట్లో చిచ్చు పెట్టి చంద్రబాబు చలి కాచుకుంటున్నారు’ అని పేర్ని నాని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version