మహిళా ఎంపీటీసీకి లైంగిక వేధింపులు.. కేసు విత్ డ్రా చేసుకోవాలని నాటు తుపాకితో బెదిరింపు..!

-

సాధారణంగా కొందరూ వ్యక్తులు తెలిసో తెలియక లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. వారిపై కేసు పెడితే భయబ్రాంతులకు గురవుతారు. ఆ తరువాత కాళ్ల, వేళ్ల పడి బ్రతిమిలాడి కేసు నుంచి తప్పించుకుంటుంటారు. కోర్టుల వరకు వెళ్లకుండా రాజీపడతారు. ఇలా కొన్ని సంఘటనలు జరిగితే.. మరికొన్ని మాత్రం కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తారు.

సత్యసాయి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఓ మహిళా ఎంపీటీసీ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె కేసు పెట్టడంతో.. కేసు విత్ డ్రా చేసుకోవాలని ఏకంగా నాటు తుపాకి తీసుకొని బెదిరించాడు. దీంతో ఆమె భయబ్రాంతులకు గురైంది. వివరాల్లోకి వెళ్లితే.. సత్యసాయి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంటి మద్ది గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  నాటు తుపాకీతో గంగాధర్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. గతంలో సుద్దగుంటపల్లిలో మహిళా ఎంపీటీసీకి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇవాళ కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గంగాధర్ కి దేహశుద్ధి చేసి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version