యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్

-

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సినీ నటుడు సుమన్ గురువారం దర్శించుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం సుమన్ కుటుంబ సభ్యులకు అర్చక పండితులు వేదాశీర్వచనం పలికారు.ఇక ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. పునర్నిర్మాణం ముందు ఈ ఆలయం ఎలా ఉండేదో నాకు తెలుసని, కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆలయాన్ని చాలా అందంగా అద్భుత శిల్పకళతో నిర్మింపచేశారని మెచ్చుకున్నారు.

ఎంతో మంది శిల్పులు పనిచేసి అద్భుత శిల్పాలను, గోపురాలను చెక్కారని, గుడిలోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉందన్నారు. ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని, భవిష్యత్తులో యాదగిరిగుట్ట ఆలయం దేశ, విదేశాల్లో మరింత ఖ్యాతిని పొందుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version