సోఫా గోదాంలో అగ్నిప్రమాదం.. రూ.15 లక్షల ఆస్తి నష్టం

-

నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే బడంగ్ పేట్ జల్ పల్లి లోని ఓ సోఫా గోదాంలో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పహాడీషరీఫ్ ఇన్ స్పెక్టర్ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లికి చెందిన మొహమ్మద్ షోయబ్ వాదియె ఉమర్ లో ఓ గోదాంలో గత కొంత కాలంగా సోఫాలు తయారు చేస్తున్నారు. ఎప్పటి లాగే సోమవారం రాత్రి పనులు ముగించుకున్న అనంతరం గోదాంకు తాళం వేసి వెళ్లారు. మరునాడు ఉదయం 6 గంటల సమయంలో గోదాం యజమాని మొహమ్మద్ షోయబ్ స్థానికులు ఫోన్ చేసి మీ గోదాంలో మంటలు చెలరేగుతున్నాయని చెప్పారు.

Fire - Wikipedia

వెంటనే యజమాని పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ ల ద్వారా నాలుగు గంటలు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఇప్పటికే పూర్తిగా తయారైన సోఫాలతో పాటు సోఫా కు సంబంధించిన సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యింది. రూ. 15 లక్షలు వరకు ఆస్తి నష్టం సంభవించిందని షోయబ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news