BREAKING : జింఖానా గ్రౌండ్‌ టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

-

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో దీపావళి పండుగ వేళ విషాదం చోటుచేసుకున్నది. టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. నగరంలోని గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్‌లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో టపాసు పేలింది. దీంతో షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కొక్కటిగా అన్ని పటాకులు పేలడంతో మంటలు పక్కనేఉన్న రెండు దుకాణాలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి.

పటాకుల దుకాణంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. మృతులను పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు విజయవాడ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news