జమ్ముకశ్మీర్లో మరోసారి ఆర్మీ వాహనంపై కాల్పులు

-

జమ్ముకాశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్‌లో మరోసారి ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎవరికీ అపాయం సంభవించలేదు. దీంతో దాడి తర్వాత ఘటనా స్థలిని భద్రతా బలగాలు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ప్రస్తుతం బటాల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.దీపావళి పండుగ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరపడం గమనార్హం.

ఇదిలాఉండగా, జమ్ముకశ్మీర్‌లో వారం వ్యవధిలోనే ఇద్దరు జవాన్లు సహా 12 మంది ఉగ్రదాడుల్లో మరణించారు. అక్టోబర్ 24న బారాముల్లాలోని గుల్‌మార్గ్ సమీపంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, నలుగురు కార్మికులు చనిపోయారు. అదే రోజు త్రాల్‌లో జరిగిన ఉగ్రదాడిలో యూపీకి చెందిన యువకుడు సైతం గాయడ్డాడు.అక్టోబరు 20న గందర్‌బాల్ జిల్లా సోనామార్గ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు చనిపోయారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version