వివాదంలో చిక్కుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

-

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయన.. మాల దీక్షలో ఉండి ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదానికి తెరలేపింది. దీనిపై బీజేపీ నేతలు బగ్గుమంటున్నారు. నెల్లూరు జిల్లాలోని కుద్దూస్ నగర్ లో వైసిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ ఇంటింటికి తిరిగారు.

అయితే స్థానిక ప్రజల మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీని ధరించారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా స్పందించారు. భక్తిశ్రద్ధలతో 41 రోజులపాటు నలుపు వస్త్రాలు ధరిస్తూ నిర్వహించే దీక్షలో ముస్లిం టోపీ, కండువా వేసుకొని హిందువులను అవమానపరిచారని.. దీక్షా నియమాలు పాటించని ఎమ్మెల్యే అనిల్ శబరిమలకు వెళ్లకుండా అడ్డుకోవాలని బిజెపి ఎంపీ జివిఎల్ డిమాండ్ చేశారు. ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు హిందువుల సహించరని.. దీనిని జగన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version