ఏప్రిల్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

-

విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏప్రిల్ మొదటి వారంలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెలలోనే చేయాల్సి ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. సంయుక్తంగా నిర్మాణం చేపట్టనున్న జీఎంఆర్, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే భూములను అప్పగించింది.

అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఇవాళ్టి నుంచే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉపయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version