పిల్లలు ఈ దేశ సంపద. వాళ్లని పట్టించుకోకపోతే ఎలా : గీతారెడ్డి

-

ప్రభుత్వ విద్యాసంస్థల్లోని హాస్టల్స్ లో కలుషిత ఆహారం కలుషిత నీళ్లతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి విమర్శించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారైనా హాస్టల్ విజిట్ చేస్తే ఎలాంటి పరిస్థితి ఉండకపోయేదని గీతారెడ్డి అన్నారు. అంతేకాకుండా సిద్దిపేట రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో ఇబ్బంది జరిగినా హెల్త్ మినిస్టర్ వెళ్ళలేదని, సిద్దిపేట రెసిడెన్షియల్ పాఠశాల మెస్ కాంట్రాక్టర్ తెలంగాణ మంత్రి బంధువని గీతారెడ్డి ఆరోపించారు.

J. Geeta Reddy - Wikipedia

పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతుంటే సిల్లీ ఇష్యూస్ అని మంత్రులు అంటున్నారని, పిల్లలు ఈ దేశ సంపద.. వాళ్లని పట్టించుకోకపోతే ఎలా? అని ఆమె ప్రశ్నించారు. నిధుల కొరత కూడా కలుషిత ఆహారానికి కారణమని, విద్యార్థినుల వ్యక్తిగత అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బాసర ఐఐఐటిలో మెస్ ల అంశం పెద్ద స్కాం అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ విద్యాసంస్థల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గీతారెడ్డి మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news