వివాదంలో ఇరుక్కున్న జెనీలియా.. బీజేపీ విమర్శలు..!!

-

బొమ్మరిల్లు సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే గుర్తింపు తెచ్చుకున్న హాసిని అలియాస్ జెనీలియా తెలుగు నాట చేసిన అల్లరి అంతా ఇంతా కాదు . ఇక ఆ తర్వాత ముంబై వెళ్లి హిందీ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాలలో రావడానికి సిద్ధం అవుతోంది. జెనీలియా బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక భాషలలో ఎన్నో చిత్రాలను చేసింది. బాయ్స్ చిత్రం ద్వారా జెనీలియా తెలుగు తెరకు పరిచయం అయింది. 2003 వ సంవత్సరంలో సత్యం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన జెనీలియా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

ఇక సత్యం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన సై సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2006లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా కోసం ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ . ఆ తర్వాత ఢీ, రెడీ వంటి సినిమాలు చేసి జెనీలియాకు మంచి గుర్తింపు లభించింది. ఇక నా అల్లుడు, ఆరెంజ్ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇక 2012లో సినిమాలలో అవకాశాలు లేక ఫేడౌట్ అవుతున్న సమయంలోనే రితేష్ దేశముఖ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా జెనీలియా వివాదాల్లో చిక్కుకుంది.

అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్.. ఆయన భార్య జెనీలియాకు చెందిన దేశ్ ఆగ్రో ప్రైవేట్ కంపెనీకి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్రమంగా భూములు కేటాయించిందని బిజెపి నేతలు ఆరోపించారు. అంతేకాదు రెండు సహకార బ్యాంకులు ఈ కంపెనీకి రూ.120 కోట్ల లోన్ అక్రమంగా మంజూరు చేశాయని విమర్శించారు. అలాగే ఈ రెండు అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర సీఎంగా జెనీలియా మామ రితేష్ తండ్రి గతంలో పనిచేశారు . ఇక వీరిది పొలిటికల్ కాంగ్రెస్ కుటుంబం.అందుకే ఇప్పుడు బిజెపి నేతలు వీరిపై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది . మరి ఈ విషయంపై వీరు ఎలాంటి వివరణ ఇస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version