ప్రియురాలి పెళ్లి.. మండపంలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు

-

ప్రేమించిన అమ్మాయి తో తనకు పెళ్లి జరగలేదని మనస్తాపంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ప్రియురాలికి వేరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి పెళ్లి మండపానికి వెళ్ళాడు యువకుడు. పెళ్లి మండపం లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతేకాక మంటల్లో వధువును హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన బంధువులు వెంటనే వధువుని పక్కకు జరిపారు.

దీంతో స్వల్ప గాయాలతో ఆ యువతి బయటపడింది. తీవ్ర గాయాలపాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news