భారీగా తగ్గిన బంగారం ధరలు..రూ. 52 వేల దిగువకు చేరిన పసిడి

-

 

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం ధరలు కాస్త పెరగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.

10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం పై రూ. 170 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 150 దిగి వచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52, 750 గా నమోదయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48, 350 గా నమోదయింది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా పెరిగి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి, రూ. 67, 000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news