ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రేక్షకుల‌కు అనుమ‌తి

-

ఐపీఎల్ – 2022 అభిమానుల‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో బీసీసీఐ చ‌ర్చ‌లు జ‌రిపింది. ఆట‌గాళ్ల బ‌యో బబూల్, మ్యాచ్ ల నిర్వ‌హాణ‌, మైద‌నాల తో పాటు ప్రేక్షకుల అనుమ‌తికి సంబంధించి కూడా మ‌హారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ చ‌ర్చ‌లు జ‌రిపింది. కాగ ఐపీఎల్ మ్యాచ్ లు జ‌రుగుతున్న స‌మ‌యంలో 25 శాతం సామ‌ర్థ్యంతో ప్రేక్షకుల అనుమ‌తికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీసీసీఐ కూడా ఐపీఎల్ నిర్వ‌హ‌కుల‌కు మైదానంలో 25 శాతం సామ‌ర్థ్యంతో ప్రేక్షకుల అనుమ‌తి ఇచ్చింది.

అంతే కాకుండా క‌రోనా ప‌రిస్థితులను బ‌ట్టి ప్రేక్షకుల సామ‌ర్థ్యం పెంచుతామ‌ని కూడా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, బీసీసీఐ తెలిపాయి. కాగ మార్చి 14, 15 తేదీల నుంచే ఐపీఎల్ – 2022 కోసం ప్రాక్టిస్ ప్రారంభం కానుంది. కాగ బ‌యో బ‌బూల్ లో ఉండే ఆట‌గాళ్లు, సిబ్బంది టోర్నీ కి ముందు 3 నుంచి 5 రోజుల ముందే త‌ప్ప‌ని స‌రిగా క్వారంటైన్ లో ఉండనున్నారు. అలాగే ముంబాయి ప్ర‌యాణానికి ముందు ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష కూడా చేయ‌నున్నారు. అలాగే క్వారైంటన్ లో ఆట‌గాళ్లు ఉండే స‌మ‌యంల్లోనూ మూడు సార్లు క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు చేస్తారు. కాగ మార్చి 26 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version