ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌.. ప్రమోషన్లకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌!

-

ఏపీలోని టీచర్లకు జగన్‌ సర్కార్‌ తీపికబురు చెప్పింది. ఏపీలో ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్ మాస్టర్ల నియామకం కోసం వెయ్యి వరకు ఎస్‌ఏ పోస్టులను గ్రేడ్‌ 2 హెచ్‌ఎం పోస్టులుగా అప్‌ గ్రేడ్‌ చేస్తున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఎస్‌ఏలకు వీటిలో పదోన్నతి కల్పిస్తారు. పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరక్టర్‌ ఈ పదోన్నతుల విధివిధానాలను సర్క్యూలర్‌ రూపంలో రిలీజ్‌ చేశారు.

ఎస్‌ఏ, గ్రేడ్‌ 2 హెడ్‌ మాస్టర్‌ పోస్టులలో పదోన్నతులకు సంబంధించి జిల్లాల వారీగా సీనియార్టీ జాబితాలను ఈ నెల 10వ తేదీలోగా రూపొందించాలని రీజినల్‌ జాయింట్ డైరక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించారు. గతంలో ప్రమోషన్లపై న్యాయపరంగా వివాదాలు జరగడంతో ఏకరూప నిబంధనలను అనుసరించాలని సర్క్యూలర్‌ లో పొందుపరిచారు. ఎస్‌ఏ, హెడ్‌ మాస్టర్‌ పోస్టులకు సంబంధించి నిబంధనలున్నాయని.. మిగిలిన అర్హతలను పరిగణలోకి తీసుకుని పదోన్నతులు కల్పించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version