తెలంగాణ టీచర్లకు శుభవార్త..ఆ గడువు పెంపు !

-

ఆన్లైన్ పద్ధతిలో లోపాలు, అప్ గ్రేడ్ కానీ ఆప్షన్లు, కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు, ఇలా ఉపాధ్యాయుల బదిలీల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. గడువు పొడిగింపు విషయాన్ని సోమవారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీచర్ల బదిలీలు, పదోన్నతికి సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి టీచర్లు బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు సోమవారం ముగుస్తుంది. కాగా తెలంగాణ రా ష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వరకు 27, 668 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన వెల్లడించారు. ఓకే స్కూల్లో 8 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్లను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. కాగా, దరఖాస్తు చేసుకునే గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news