తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వరలోనే ఉచితంగా ఆ ఆపరేషన్లు !

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఇటీవల మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేపించుకున్న పేషెంట్లను పరామర్శించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ….గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పరిమిత అయినా మోకాలి చిప్పలు మార్పిడి నీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో ప్రారంభిస్తామని ప్రకటన చేశారు.

ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట ఆసుపత్రిలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తామని.. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలపై రోగులకు భయం పోయి దైర్యం, నమ్మకం కలిగిందని.డబ్బులు ఉన్నవాళ్ళకి మాత్రమే చేసుకునే మోకాలి చిప్పలు మార్పిడి నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద వాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ ఆలోచనలు అమలు అవుతున్నాయ్.. సీఎం కెసిఆర్ కలలు నేడు నిజమవుతున్నాయని పేర్కొన్నారు. ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 30శాతం డెలివరీ లు అవుతే నేడు 56శాతం అవుతున్నాయి..సీఎం కెసిఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఏర్పాటు చేయడం వల్లనే సర్జరీలు సాధ్యం అవుతున్నాయని స్ఫష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version