గుంటూరు కారం చిత్ర యూనిట్ కి సర్కార్ గుడ్ న్యూస్..!

-

మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా రాబోతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ సినిమా ఇది. జనవరి 12న ఇది రిలీజ్ అవుతుంది ఈ సినిమా రిలీజ్ కి ముందు తెలంగాణ ప్రభుత్వం సినిమా టీం కి గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకి రోజుకి ఆరు షోలు వేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్.

సినిమా రిలీజ్ అయిన రోజు నుండి వారం రోజులు పాటు ఉదయం 4:00 గురించి నుండి మొత్తం ఆరు షోలు వేసుకునే అవకాశం ఇచ్చింది దానితోపాటు సినిమా టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ టికెట్ మీద 65 రూపాయలు మల్టీప్లెక్స్ లో 100 చొప్పున పెంచుకోవచ్చని జీవోలో రాశారు అంతేకాకుండా సినిమా రిలీజ్ రోజున 1:00 కి షో వేసుకోవచ్చు అని కూడా పర్మిషన్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version