7 గంటల పాటు గౌతు శిరీషను విచారించిన సీఐడీ పోలీసులు

-

సోషల్‌ మీడియా వేదిక ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాలో పోస్టుల కేసులో టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ గౌతు శిరీష‌ను సీఐడీ అధికారులు సోమ‌వారం దాదాపుగా 7 గంట‌ల పాటు విచారించారు. మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని డీజీపీ కార్యాల‌యంలోని సీఐడీ విభాగంలో జ‌రిగిన ఈ విచార‌ణ ముగిసిన అనంత‌రం డీజీపీ కార్యాల‌యం బ‌య‌ట త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా శిరీష్ సంచ‌ల‌న విషయాలు వెల్లడించారు.

TDP Gouthu Sirisha : టీడీపీ మహిళా నేతకు సీఐడీ నోటీసులు.. - NTV

ఈ కేసులో నేరం ఒప్పుకోవాలంటూ సీఐడీ అధికారులు త‌న‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని శిరీష ఆరోపించారు. అయిదే దానికి తాను స‌సేమిరా ఒప్పుకోలేద‌ని వెల్ల‌డించారు శిరీష. ఈ కేసును న్యాయ‌ప‌రంగానే తాను ఎదు‌ర్కొంటాన‌ని సీఐడీ అధికారుల‌కు చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు శిరీష. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాలంటూ తానెవ‌రికీ చెప్ప‌లేద‌ని కూడా తెలిపానని, ఇక విచార‌ణ‌లో భాగంగా సీఐడీ అధికారులు త‌న‌ను ఇబ్బందిపెట్టార‌ని ఆరోపించారు శిరీష. 7 గంట‌ల పాటు విచార‌ణ సాగ‌గా… మ‌ధ్యాహ్నం వేళ త‌న‌కు క‌నీసం భోజ‌నం కూడా పెట్ట‌లేద‌ని ఆరోపించారు ఆమె. అంతేకాకుండా విచార‌ణ సంద‌ర్భంగా త‌న న్యాయ‌వాది ఉండడానికి కూడా సీఐడీ అధికారు‌లు ఒప్పుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు శిరీష.

Read more RELATED
Recommended to you

Latest news