ప్రైవేట్ ఆస్పత్రులపై గవర్నర్ తమిళ సై సీరియస్

-

ప్రైవేట్ ఆసుపత్రుల పై గవర్నర్ తమిళ్‌ సై ఫైర్ అయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రిలలో వైద్యం అంటేనే పేదలు భయపడి పోతున్నారని.. లాభాపేక్ష లేకుండా ప్రైవేట్ ఆసుపత్రు లు వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ సమయంలో వైద్యులు. సిబ్బంది సేవలు అభినందనీయమమని.. తాను …తన భర్త వైద్యులమేనని చెప్పారు గవర్నర్ తమిళ్ సై.

రాజ్ భవన్ లో రెడ్ క్రాస్ డే వేడుకలు జరుగగా ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడారు. ఈరోజు మథర్స్ డే, రెడ్ క్రాస్ డే అని.. రాజ్ భవన్ లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం.. ఒక్క మెసేజ్ చేసిన కూడా రెడ్ క్రాస్ స్పందిస్తుందని చెప్పారు. ప్యాండమిక్ సమయంలో ఆర్మీ, పోలీస్ అధికారులు తలసేమియా రోగులకు బ్లడ్ ఇచ్చారు.. బ్లడ్ ఇచ్చి తలసేమియా రోజులకు సహాయం చేయండని పేర్కొన్నారు. 33 జిల్లాల్లో పర్యటించి రెడ్ క్రాస్ ని విస్తరించాలని అనుకుంటున్నానని.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉన్నాయి.. వాటిని మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version