BREAKING : సీఎం కేసీఆర్ కు షాక్..అమిత్ షాకు గవర్నర్ తమిళిసై ఫిర్యాదు !

-

ఢిల్లీ : పార్లమెంట్‌ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ గవర్నర్ తమిళి సై కలిశారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ గవర్నర్‌ తమిళి సై.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలువగా.. ఇప్పుడు అమిత్‌ షాను కలిసారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఈ రెండు సమావేశాల్లో.. సీఎం కేసీఆర్‌ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజుల నుంచి టీఆర్‌ఎస్‌ సర్కార్‌, తెలంగాణ గవర్నర్ తమిళి సై మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళి సై.. ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. కాగా.. నిన్న ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాత మీడియాతో ఈ విషయంపై మాట్లాడారు గవర్నర్ తమిళి సై.

నన్ను కేసీఆర్‌ ప్రభుత్వం అవమానించింది..ఇది ప్రధాని మోడీకి కూడా తెలుసు..దీనిపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని.. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను అని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news