తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

-

తెలంగాణ ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్సై మరియు కానిస్టేబుల్ నియామకాలకు నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణులు అయిన రెండు లక్షల 37 వేల మంది పార్టు 2 కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

అయితే ఈ దరఖాస్తులలో తప్పిదాలు దొర్లాయని, అలాగే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయితే దీనిపై తాజాగా టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ శ్రీనివాసరావు స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు శ్రీనివాసరావు. దరఖాస్తుల సవరణకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో లేదా అంతకుముందు ఛాన్స్ ఇస్తామని వివరించారు. అభ్యర్థులు దీనిపై గందరగోళానికి గురికాకూడదని సూచించారు. ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version