అమెరికాలో కాల్పుల కలకలం…పది మంది మృతి !

-

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారని తెలుస్తోంది. నిన్న కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఓ సూపర్‌ మర్కెట్‌లోకి చొరబడి అక్కడి కస్టమర్ ల మీద కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పోలీసు అధికారి సహా పది మంది మృతి చెందారు. ఈ కాల్పులతో భయాందోళనకు గురైన స్టోర్‌లోని వినియోగదారులు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

పోలీసుల  వివరాల ప్రకారం.. ‘‘బౌల్డర్‌లోని కింగ్‌ సూపర్‌ మార్కెట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడని నిన్న మధ్యాహ్నం 2.30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారి సహా మొత్తం పది మంది మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి గల కారణాలేంటి విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మొన్న ఈ మధుయ అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై దుండగులు కాల్పులకు పాల్పడటం సంచలనం సృష్టించింది. 

Read more RELATED
Recommended to you

Latest news