బీజేపీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయి.. అమిత్‌ షాకు హరీశ్‌ రావు కౌంటర్‌..

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభకు హాజరయ్యారు. అయితే.. ఈ సభలో మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా తీవ్రంగా స్పందించారు. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్‌ డిజిట్‌ తెచ్చుకునే ప్రయత్నం చేయాలని విమర్శించారు. మాకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెక్కిరించినప్పుడే బీజేపీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయని అన్నారు.

బ్యాట్‌ సరిగ్గా పట్టడం చేతకాని మీ అబ్బాయిని ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసని అమిత్‌ షాను ఉద్దేశించి మంత్రి హరీశ్‌ రావు అన్నారు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్‌ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోక ముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్‌ను విమర్శించేదని మండిపడ్డారు. 2జీ, 3జీ, 4జీ కాదు.. కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version