రజినీకాంత్‌ను కలిసిన హీరో కార్తీ, నాజర్.. ఎందుకంటే..?

-

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి పరిమితమయ్యారు. ఈ మేరకు ఎవరైనా దర్శకులు ఇంటికి వచ్చి సినిమా కథ చెప్తే వినడం.. నెక్ట్స్ మూవీకి ప్లాన్ చేసుకోవడం జరుగుతోంది. అయితే తాజాగా రజినీకాంత్‌ను తమిళ హీరో కార్తీ, ప్రముఖ నటుడు నాజర్ వెళ్లి కలిశారు. ఈ భేటీ ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారింది.

రజనీకాంత్-నాజర్-కార్తీ

హీరో కార్తీ, నాజర్ నడిగర్ సంఘం తరఫున రజినీకాంత్‌ను కలిసినట్లు సమాచారం. దాదాపు రెండేళ్ల తర్వాత నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నాజర్ అధ్యక్షుడిగా, కార్తీ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నడిగర్ సంఘ నూతన భవన నిర్మాణ పనులపై రజినీకాంత్‌తో చర్చించినట్లు సమాచారం. నూతన భవన నిర్మాణంపై రజినీకాంత్ సూచనలు, సలహాలను తీసుకున్నారు. త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version