బిగ్ బాస్ లో నరకం చూసా అంటున్న నోయల్.. అసలు విషయం ఏమిటంటే..?

-

నోయల్.. తెలుగు నాట ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన నటుడుగా కూడా పలు చిత్రాలలో నటించాడు . ముఖ్యంగా పాప్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న నోయల్ తన కెరియర్ లో సక్సెస్ అయ్యాడే కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ పొందలేకపోయాడు. భీమవరం బుల్లోడు ఫేమ్ ఎస్తేరును వివాహం చేసుకున్న తర్వాత పెళ్లయిన ఆరు నెలలకు విడాకులు తీసుకోవడం చాలా విషాదకరమని చెప్పవచ్చు. తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నప్పటికీ ఇలా అర్ధాంతరంగా ఆరు నెలలకే విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక విడాకుల తర్వాత నోయల్ బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు .ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈయన నటించిన పంచతంత్ర కథలు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగానే కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు. ఇక అతి తక్కువ మంది కంటెస్టెంట్లతో ఫోన్ కూడా లేకుండా బిగ్ బాస్ హౌస్ లో అన్ని రోజులు ఎలా ఉండగలిగారు అని యాంకర్ ప్రశ్నించగా… అందుకు స్పందిస్తూ.. బిగ్ బాస్ హౌస్లో నరకం చూసాను. సాధారణ మనుషులు ఎవరూ కూడా అందులో ఉండలేరు. సరైన తిండి ఉండదు , నిద్ర అనేది అసలు ఉండదు.. ఒత్తిడికి, ఆందోళనకు కచ్చితంగా గురవుతారు అంటూ సంచలన విషయాలు తెలిపారు నోయల్.

అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో చూపించే కొన్ని రకాల రంగులు మనలో ఆందోళనను కలిగిస్తాయి .టెన్షన్, ఎమోషన్స్ కూడా మనకు తెలియకుండానే వస్తుంటాయి అని నోయల్ తెలిపారు. ఇక ఎవరికైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని కోరిక ఉంటే వెంటనే ఉపక్రమించుకోవడం మంచిది అంటూ కూడా నోయల్ తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ ద్వారా చిన్న నరకాన్నే నోయల్ చూసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version