హైదరాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ లు తెచ్చింది నేనే: చంద్రబాబు

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేతిలో ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆంధ్రాలోనే తన పార్టీని బలోపేతం చేసుకోవడం మానేసి ముగిసిన అధ్యాయంగా ఉన్న తెలంగాణాలో మళ్ళీ టీడీపీకి ఆయువు పోయడానికి అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు. ఈ సందర్భంగా ఈ రోజు హైద్రాబాద్ లో టీడీపీ ఆవిర్భావ సభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు రెండు రాష్ట్రాల నుండి టీడీపీ ముఖ్య నాయకులు విచ్చేయడం విశేషం.

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ హైద్రాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ లు వచ్చాయంటే అది నేను పడిన కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజు ఎందరో ఇంజనీర్ లుగా ఎదగడానికి కారణం ఆరోజు నేను చంకలో ఫైల్స్ పెట్టుకుని ఢిల్లీ ఆఫీస్ ల చుట్టూ తిరగడమే అన్నారు. ఇదంతా చేసింది నా తెలుగుజాతి కోసం కదా అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మరి ఈ రోజు చరిత్ర తెలిసిన పెద్దలు అంతా ఆలోచించాలి ఇంజనీరింగ్ కాలేజ్ లు ఎలా వచ్చాయో ?

Read more RELATED
Recommended to you

Latest news