ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

-

హైదరాబాద్‌ వాసులకు షాక్‌ ఇచ్చి దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఇప్పటికే వారాంతాల్లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. ఇప్పుడు.. నగరంలోని వివిధ మార్గాల్లో రాకపోలకు సాగించే పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈనెల 3వ తేదీన రద్దు చేస్తున్నట్టు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ఒక సర్వీసును రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Hyderabad: MMTS ready to resume, awaiting green signal

ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పలు మార్గాలను దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు సైతం రద్దు చేయడంతో హైదరాబాద్‌ వాసులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు తెలంగాణలకు చేరకున్న నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news