పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ ను పట్టించుకోను – బండి సంజయ్

-

ఈడీ నోటీసులకు సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శనివారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించి అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ కి సవాల్ విసిరారు. బండి సంజయ్ తడి బట్టలతో రేపు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రావాలని అన్నారు.

అయితే పైలట్ రోహిత్ రెడ్డి విసిరిన సవాల్ ని పట్టించుకోనని అన్నారు బండి సంజయ్. ఎవరికి పడితే వారికి స్పందించను అని కొట్టి పడేశారు. అనంతరం ప్రధానిపై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామన్నారు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల దేశమని.. మోడీ టెర్రరిస్ట్ కాదని, గుజరాత్ అల్లర్లలో మోడీని అమెరికా రాకుండా చేస్తే సుప్రీం తీర్పు తర్వాత రెడ్ కార్పెట్ తో అమెరికా స్వాగతం పలికిందని గుర్తు చేశారు. పాకిస్తాన్ విమర్శలపై ప్రతి భారతీయుడు స్పందించాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version