తెలంగాణలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు..ఏప్రిల్‌ 1 నుంచి అమలు

-

తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈ ఆర్ సి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ పై 40 నుంచి 50 పైసల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇతర కేటగిరీల పై యూనిట్ టు రూపాయి చొప్పున పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

19 శాతం విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరగా… 14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్ఎసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్ చార్జీల పెంపు కే మొగ్గు చూపితే… తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి కరెంటు చార్జీలు పెరగనున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల పై భారం పడనుంది.

గృహవినియోగ దారులకు :
ఎల్‌టీ-1 ఏలో 50 యూనిట్ల వరకు రూ.1.40 నుంచి రూ.1.95 కు పెంపు
ఎల్‌టీ-1 ఏలో 51-100 యూనిట్ల వరకు రూ. 2.60 నుంచి రూ.3.10 కు పెంపు
ఎల్‌టీ-1 ఏలో 100 యూనిట్ల వరకు రూ. మ3.30 నుంచి రూ.3.40 కు పెంపు

Read more RELATED
Recommended to you

Latest news