టీడీపీలో వణుకు పుట్టిస్తున్న లేటెస్ట్ ఎన్నికల సర్వే !

-

తెలంగాణాలో డిసెంబర్ నెలాఖరు లోపు లేదా జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి, ఇక ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంవత్సరం మార్చి నెలలో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ రాజకీయ పార్టీలు వ్యూహాలతో తలమునకలై ఉన్నాయి. కాగా తాజాగా విడుదల అయిన ఒక సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలు కొన్ని పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాలకు గాను ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న సర్వేను ఇండియా టీవీ CNX చేపట్టింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో BRS కు 8 సీట్లు, బీజేపీకి 6 సీట్లు, కాంగ్రెస్ కు 2 సీట్లు ఎంఐఎం కు ఒక్క సీటు వస్తాయని తెలిపింది. ఇక ఏపీలో చూస్తే ఉన్న పార్లమెంట్ స్థానాలకు గానూ అధికార వైసీపీకి 18 మరియు టీడీపీకి 7 సీట్లు వస్తాయని తెలిపింది.

ఈ సర్వే ఫలితంతో టీడీపీ ఊహించిన విధంగా లేదని నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక వైసీపీ మరోసారి పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని టీడీపీకి షాక్ ఇవ్వనుంది అంటూ ఈ సర్వే ద్వారా తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version