టోక్యో ఒలింపిక్స్‌ : కాంస్యం మిస్‌ చేసుకున్న మహిళల హాకీ జట్టు

-

టోక్యో ఒలింపిక్స్‌ లో మొదటి నుంచి అత్యున్నత ప్రదర్శన ను కనబరుస్తున్న భారత మహిళల హాకీ జట్టు ఉత్కంఠ పోరు లో ఓటమి చవి చూసింది. కీలక పోరులో ఓటమి పాలై…కాంస్య పతకం మిస్‌ చేసుకుంది భారత మహిళల హాకీ జట్టు. ఇవాళ బ్రిటన్‌ మహిళల హాకీ మరియు భారత మహిళల హాకీ జట్ల మధ్య… కీలక పోరు జరిగింది.

అయితే.. ఈ కాంస్య పోరులో టీం ఇండియా   పై బ్రిటన్‌ అనూహ్యంగా విజయం సాధించింది. మహిళల హాకీలో 4-3 తేడాతో బ్రిటన్‌ విజయం సాధించింది. దీంతో కాంస్య పతకం చేతులారా పోగోట్టుకుంది భారత మహిళల హాకీ జట్టు. రెండో క్వార్టర్ లో గేమ్‌ లోకి దూసుకొచ్చిన భారత్‌.. బ్రిటన్‌ దూకుడుకు కళ్లెం వేసినా ఫలితం లేకపోయింది. చివరి క్వార్టర్‌లో బ్రిటన్‌ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. భారత ప్లేయర్లకు అవకాశం ఇవ్వకుండా డిఫెండ్‌ చేస్తూ… విజయం దక్కించు కుని కాంస్య పతకం కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version