ప్రభుత్వం కీలక నిర్ణయం.. 6 రోజులు సోషల్ మీడియా మొత్తం బ్యాన్

-

పాకిస్థాన్లోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొహర్రం సందర్భంగా ద్వేషపూరిత కుట్రలు, ప్రచారాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జులై 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజులపాటు సోషల్ మీడియా వేదికలపై బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్, టిక్టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్పై ఆరు రోజుల పాటు నిషేధం ఉంటుందని పేర్కొంది.

మతపరమైన హింసను నివారించడానికి, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, విద్వేషపూరిత విషయాలను నియంత్రించడానికే సోషల్ మీడియాపై బ్యాన్ విధించామని పంజాబ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (అప్పట్లో ట్విటర్) పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవలే సోషల్ మీడియాపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాను విషపూరిత మీడియాగా అభివర్ణించారు. అలాగే నేటి సోషల్ మీడియాను డిజిటల్ టెర్రరిజంతో పోల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version