దేశ ప్రజలకు అవసరమైన విధంగా జాతీయ పార్టీ నిర్మాణం – జగదీష్ రెడ్డి

-

దేశ ప్రజలకు అవసరమైన విధంగా జాతీయ పార్టీ నిర్మాణం అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. భారత దేశం లో ఇప్పటి వరకు ఉన్న జాతీయ పార్టీ లు వైఫల్యం చెందాయని.. దేశ అభివృద్ధి లో ఏ ఒక్కరు కూడా స్ఫూర్తి దాయకంఅయన పద్దతిలో పని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన మొదటి నుండి అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు,ఆ తరువాత సామూహికంగా వచ్చిన,కొన్ని కుటామిలతో వచ్చిన పార్టీ లు,ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ లు వైఫల్యం చెందాయని వెల్లడించారు.

ఈ దేశ భవిష్యత్తు కు సరైన ప్రణాళికలు వేయకపోవడం మే కాక అభివృద్ధి కూడా చేయకపోవడం సిగ్గుచేటని మంత్రి ఎద్దేవా చేశారు. ఎన్నో సహజ వనరులు ఉన్నప్పటికీ,వాటిని ప్రజల అనుగుణంగా సరిగా ఒక ప్రభుత్వం కూడా సరిగా ఉపయోగించలేదని.. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ గా కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నదని చెప్పారు. బీజేపీ నుండి అభివృద్ధి పక్కన పెడితే దేశం దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చారని.. ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్న ఏకైక ప్రభుత్వం బిజెపి అని విమర్శించారు. దేశ ప్రజలకు అవసరమైన ఈ విధంగా పక్క ఎజెండాతో పార్టీ నిర్మాణం కోసం కెసిఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారని పేర్కొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news