నేడు జనసేన ఆవిర్భావ సభ.. “దామోదరం సంజీవయ్య”నామకరణం

-

అమరావతి : నేడు గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరుగనుంది.. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టింది జనసేన పార్టీ. ఇక ఈ సభకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్.. నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన కీలక సందేశం కూడా ఇచ్చారు. ఆవిర్భావ సభకు దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా పేరు పెట్టామని.. ఈసారి జరిగే ఆవిర్భావ సభ గతంలో జరిగిన ఆవిర్భావ సభల్లాంటిది కాదని పేర్కొన్నారు పవన్‌.

ఏపీ భవిష్యత్‌ కోసం జనసేన చేపట్టే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేసుకునే ఆవిర్భావ సభ అని.. ఇప్పటి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చర్చించుకుంటాం.. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకుంటామన్నారు. ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు సృష్టిస్తే.. ఆవిర్భావ దినోత్సవానికి వెళ్లడం మా హక్కు అని చెప్పండనికోరారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై మాట్లాడబోతున్నామని.. ఆవిర్భావ సభలో అనేక సందేహాలకు.. విమర్శలకు సమాధానం చెబుతామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version