తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి టీటీడీ పాలక మండలి. ఇవాళ ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నట్టు టీటీడీ పాలక మండలి ప్రకటించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు జనవరి 12 నుంచి పిభ్రవరి 21వ తేది వరకు సంభందించిన టిక్కేట్లు విడుదల కానున్నాయి.

 

 

పిభ్రవరి 22 నుంచి 28 వరకు శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా టిక్కేట్లు జారీ నిలిపివేసింది టీటీడీ పాలక మండలి. రేపు వసతి గదులు కోటా విడుదల చెయ్యనుంది టిటిడి. జనవరి 12 నుంచి పిభ్రవరి 28వ తేది వరకు సంభందించిన గదులును విడుదల చేయనుంది. అలాగే, అన్నప్రసాద సముదాయంలో ఒక్కరోజు వితరణకు 33 లక్షలు విరాళంగా భక్తులు సమర్పించవచ్చు…అల్పాహారానికి 7.7 లక్షలు,మధ్యహ్నం భోజనానికి 12.65 లక్షలు…రాత్రి భోజనానికి 12.65 లక్షల రూపాయలు వ్యయం అవుతున్నట్లు తెలిపింది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version