2024 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి

-

నేడు సీఎస్‌ సమీర్‌ శర్మ పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఏపీకి తదుపరి సీఎస్‌గా ఎవరు నియమితులవుతారన్న విషయంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సీఎస్‌ గా జవహర్‌ రెడ్డికే అవకాశం దక్కుతుందన్న వాదనలు గట్టిగానే వినిపించాయి. తాజాగా ప్రభుత్వం కూడా జవహర్‌ రెడ్డి వైపే మొగ్గు చూపుతూ సీఎస్‌ గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న సమీర్ శర్మ నుంచి ఆయన బాధ్యతలను అందుకున్నారు. 2024 జూన్ వరకు జవహర్ రెడ్డి సీఎస్ గా కొనసాగే అవకాశం ఉంది. తనకు సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ఈ సందర్భంగా జవహర్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు.

ముఖ్యమంత్రి నేతృత్వంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. సీఎం జగన్ కు ఆయన ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. సీఎస్ గా బాధ్యతలను చేపట్టిన జవహర్ రెడ్డికి వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జవహర్‌ రెడ్డి… ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బదిలీ అయ్యారు. అంతకుముందు పలు కీలక శాఖల్లోనూ ఆయన పని చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version