దుబ్బాక, హుజూరాబాద్ ఓటములతో కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు- జేపీ నడ్డా.

-

బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా .. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దుబ్బాక ధమాకా, హుజూరాబాద్ ఓటములతో కేసీఆర్ తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని అన్నారు. పోలీస్ అధికారులు నన్ను అడ్డుకోవాలని చూశారని.. నేను కావాలంటే అక్కడే సభను నిర్వహించవచ్చు.. కానీ కోవిడ్ నిబంధనలు పాటించేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. గ్యాస్ కట్టర్లు, స్టీల్ రాడ్లతో పోలీసులు దాడి చేశారని విమర్శించారు. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామ్యం అని అన్నారు. శాంతియుతంగా బండి సంజయ్ నిరసన తెలిపితే అరెస్ట్ చేశారని విమర్శించారు. కాళేశ్వరం వల్ల కేసీఆర్ ఫామ్ హౌజ్ కు మాత్రమే నీళ్లు వస్తున్నాయని అన్నారు. దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ ఉందని అన్నారు. వినాశకాలే విపరీత బుద్దిగా కేసీఆర్ పనులు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version