ఏపీని కేసీఆర్ కు అమ్మేద్దామని జగన్ చూస్తున్నారు : కన్నా

-

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ జగన్ వ్యవహార శైలి..అనుభవ లేమి వల్ల హైదరాబాద్‌లో ఆంధ్రుల ఆస్తులు పోయాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమ్మేయాలని జగన్‌ చూస్తున్నారని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే ఏపీని కేసీఆర్‌కు గంపగుత్తగా అమ్మేస్తారని మండిపడ్డారు. ఎన్జీ రంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లో ఆయన విగ్రహానికి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి జగన్ గెలిచారని చెప్పారు. తమనే కాకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని కూడా జగన్ మోసం చేశారనే విషయాన్ని ప్రజలు గమనించారనే… ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 40 రోజులుగా తెలంగాణకు నీరు వెళ్తోందని… అయినా జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్జీ రంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఆయన విగ్రహం వద్ద టీడీపీ నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కన్నా పైవ్యాఖ్యలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version