Breaking news: సీఎం కేసీఆర్ తో మంత్రుల ఆకస్మిక భేటీ… ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో మంత్రులతో సమావేశం

-

తెలంగాణలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ఆకస్మికంగా మంత్రులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో ఉన్నారు సీఎం కేసీఆర్. ఈ ఉదయం ఫామ్ హౌజ్ నుంచి పలువురు మంత్రులకు ఫోన్లు వెళ్లాయి. ఫామ్ హౌజ్ కు రావాల్సిందిగా కేసీఆర్ నుంచి మంత్రులకు ఆదేశాలు అందాయి. మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల, ఇంద్ర కరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలువురు అధికారులు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు హుటాహుటిన వెళ్లారు. అయితే కేసీఆర్ ఈ ఆకస్మిక భేటీ దేనికోసం నిర్వహిస్తున్నారనేది ఇప్పటికైతే సస్పెన్సే. 

ప్రస్తుతం మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. అయితే అధికారులు కూాడా ఈ సమావేశంలో పాలుపంచుకోవడంతో ఏదైనా కొత్త పథకానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుందా..? అనే అనుమానాలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version