పేద ప్రజలకు శుభవార్త.. బస్తీ దవాఖానలపై కెసిఆర్ కీలక ప్రకటన

-

తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. బస్తి దవాఖానాలు ఏర్పాటు చేసామనీ.. మిగిలిన చోట కూడా బస్తి ధవాఖానాలు కూడా ఏర్పాటు చేస్తున్నామనీ వెల్లడించారు. బస్తి ధవాఖానాలు ఏర్పాటు తో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది..వైద్య సేవలతో పాటు, మందులు కూడా ఉచితం అని చెప్పారు. బస్తి ధవాఖానాలు సాయంత్రం కూడా తెరవాలని సూచించామనీ.. వైద్యా సేవలు ఎప్పుడైనా అందుబాటులో ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నామనీ ప్రకటన చేశారు.

కరోనా వల్ల పల్స్ పోలియో వాయిదా వేసుకున్నాం..వచ్చే మూడు రోజులు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. 20 వేల సెంటర్లలో పోలియో కార్యక్రమం చేపట్టమని.. ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయాలని సూచించారు. 28 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నాం..అనేక మంది పోలియోతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5ఏళ్ళ పిల్లలకు వేయించాలి..ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఏ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ ముందుంటుంది..కరోనా వ్యాక్సిన్ లో తెలంగాణ అగ్రభాగాన నిల్చిందని పేర్కొన్నారు. కరోనా వాకిన్స్ వేసుకోని వారు కూడా వేసుకోవాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news